శతాధిక వృద్ధురాలి మృతి

by Bhanu |

మండలంలోని పాలెఅన్నారానికి చెందిన తమ్మనబోయిన వెంకమ్మ(105) బుధవారం మృతి చెందారు.

శతాధిక వృద్ధురాలి మృతి
X

దిశ, చిలుకూరు: మండలంలోని పాలెఅన్నారానికి చెందిన తమ్మనబోయిన వెంకమ్మ(105) బుధవారం మృతి చెందారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలికి ఐదుగురు కొడుకులు, ఆరుగురు కూతుర్లు. వీరితో పాటు మనుమలు, మనుమరాండ్లు, ముని మనవలు, ముని మనవరాండ్రు కలిపి 60 మంది కుటుంబ సభ్యులున్నారు. ఇప్పటివరకూ ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా తన పని తాను చేసుకుంటూనే జీవించడం ఈమె ప్రత్యేకత. స్థానికులు, బంధువులు వెంకమ్మ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

Next Story