ఇద్దరు సీఎంలను ఓడించిన మోడీ జీప్.. సోషల్ మీడియాలో వైరల్

by Disha Web Desk 12 |
ఇద్దరు సీఎంలను ఓడించిన మోడీ జీప్.. సోషల్ మీడియాలో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్, కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి పోటీ చేశారు. కాగా ఈ నియోజకవర్గం ఫలితం కోసం యావత్ తెలంగాణ ఆసక్తిగా ఎదురు చూసింది. అందరూ ఊహించినట్లుగానే కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి విజయం సాధించి.. సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఏకకాలంలో ఓడగొట్టిన నాయకుడిగా చరిత్రలోకి ఎక్కాడు. కాగా ఆయన విజయం అనంతరం కాటిపల్లికి చెందిన జీప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించిన మోడీ జీప్ అంటు ట్యాగ్ చేస్తూ బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ జీప్ నెంబర్ 4749 కాగా.. హిందీలో మోదీ అని వచ్చే విదంగా నెంబర్ ప్లేట్ ను కాటిపల్లి మార్చేశారు. కామారెడ్డి ప్రజలు కాటిపల్లి విజయంలో ఈ కారు కీలకంగా ఉందని చర్చించుకుంటున్నారు.

Next Story

Most Viewed