అమిత్ షా తెలంగాణకు రావడానికి ముఖ్య కారణం అదే: కౌశిక్ రెడ్డి

by Disha Web Desk 19 |
అమిత్ షా తెలంగాణకు రావడానికి ముఖ్య కారణం అదే: కౌశిక్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో విజయ సంకల్ప సభ పేరుతో బీజేపీ నిర్వహిస్తోన్న భారీ బహిరంగ సభకు కేంద్రమంత్రి అమిత్ షా హాజరు కావడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ నేతల సెటిల్‌మెంట్ల కోసమే అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారని అన్నారు. తెలంగాణలో అమిత్ షా వరుస టూర్ల వెనుక ఆర్థిక లాభాలున్నాయని ఆరోపించారు. తెలంగాణ బీజేపీలో కీలక నేతలు అయిన ఈటల రాజేందర్, వివేక్ వెంకట స్వామి మధ్య ఉన్న ఆర్థిక వ్యవహారాల సెటిల్ మెంట్ కోసం చేవేళ్ల సభకు అమిత్ షా వస్తున్నారని అన్నారు.

ఇక, విజయ సంకల్ప సభలో పాల్గొనేందుకు వస్తున్న అమిత్ షా తెలంగాణకు చేరుకున్నారు. శంషాబాద్ విమానశ్రయానికి చేరుకున్న అమిత్ షాకు తెలంగాణ బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి అమిత్ షా నేరుగా చేవేళ్లకు వెళ్లనున్నారు.



Next Story

Most Viewed