పోలవరం పూర్తి చేసుకోలేని దద్దమ్మలు మీరంటూ.. ఎమ్మెల్యే పెద్ది హాట్ కామెంట్స్

by Disha Web Desk 4 |
పోలవరం పూర్తి చేసుకోలేని దద్దమ్మలు మీరంటూ.. ఎమ్మెల్యే పెద్ది హాట్ కామెంట్స్
X

దిశ, నర్సంపేట: ఆంధ్రప్రదేశ్ మంత్రులు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు‌పై చేసిన వ్యాఖ్యల పట్ల నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సంపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్ది మాట్లాడుతూ... పోలవరాన్ని పూర్తి చేసుకోకుండా మొగులుకు మొఖం పెట్టే చాతగాని నాయకులు ఆంధ్రాలో ఉన్నారని పరుష పదజాలంతో ఎద్దేవా చేశారు. ఏపీలో సామాన్యుడు బతికే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఆంధ్ర ప్రాంతం నుండి సుమారు 30 లక్షల మంది హైదరాబాద్ కు వలస వచ్చారన్నారు. గ్యాస్ కనెక్షన్ల మార్పిడే ఓ ఉదాహరణ అని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తే ఆపలేని దద్దమ్మలు

మంత్రి హరీష్ రావు‌పై విమర్శలు చేస్తారా.. అని దుయ్యబట్టారు. మంత్రి హరీష్ రావు మాట్లాడిన దాంట్లో తప్పేముందన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో గతంలో పోరాడింది తెలంగాణ ప్రజలు కాదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం వారి దోస్తులకు విశాఖ ఉక్కును కట్టపెట్టేందుకు రూ. 6 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపితే మీ ముఖ్యమంత్రి ఏం చేశాడో తెలుసుకోవాలన్నారు. విశాఖ ఉక్కును కాపాడే దమ్మున్న నాయకుడు కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు. తెలంగాణ నుండి విడిపోయిన తర్వాత చంద్రబాబు హైదరాబాదుకు రావడం లేదా.. తెలంగాణలో అతనికి ఏం పని అని ప్రశ్నించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి, సంక్షేమ పనులకు ఆంధ్ర ప్రాంతం నుండి వలస వస్తున్నట్లు ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు.

Next Story

Most Viewed