ఇంటర్ విద్యార్థులకు 'ట్యాబ్స్'.. మంత్రి కేటీఆర్ హామీ

by Disha Web Desk 2 |
ఇంటర్ విద్యార్థులకు ట్యాబ్స్.. మంత్రి కేటీఆర్ హామీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంట‌ర్ విద్యార్థుల‌కు ట్యాబ్స్ ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయ‌ని, రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ క‌ళాశాల విద్యార్థుల‌కు గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా త్వర‌లోనే ట్యాబ్స్ పంపిణీ చేయ‌నున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ ట్యాబ్స్‌లో ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఉప‌యోగ‌ప‌డే మెటీరియ‌ల్‌తో పాటు పోటీ ప‌రీక్షల‌కు ఉప‌యోగ‌ప‌డే స‌మాచారం కూడా పొందుపర్చామన్నారు. విద్యార్థులకు ఇచ్చిన హామీని నెర‌వేర్చుకునే స‌మ‌యం ఆస‌న్నం కావ‌డంతో సంతోషంగా ఉంద‌ని, స్వయంగా తానే పంపిణీ చేస్తానని పేర్కొన్నారు.



Next Story

Most Viewed