బీజేపీ పతనం సౌత్ ఇండియా నుంచే స్టార్ట్!.. మంత్రి హరీష్ రావు

by Dishafeatures2 |
బీజేపీ పతనం సౌత్ ఇండియా నుంచే స్టార్ట్!.. మంత్రి హరీష్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ పతనం సౌత్ ఇండియా నుంచే మొదలైందని మంత్రి హరీష్ రావు అన్నారు. కర్ణాటక ఫలితాల్లో బీజేపీ ఓటమిపై స్పందించిన ఆయన.. దేశంలోని మిగతా అన్ని చోట్ల ఆ పార్టీ ఖాతాలు క్లోజ్ అవుతాయని తెలంగాణలో అయితే బీజేపీకి డిపాజిట్లు కూడా రావని ట్వీట్ చేశారు. ‘దిస్ ఈజ్ సౌత్ ఇండియా స్టోరీ’ అంటూ ట్వీట్ ఆరంభించిన ఆయన.. బీజేపీ పాలన నుంచి విముక్తి కలిగిస్తూ కర్ణాటకలో ఎన్నికల తీర్పు వచ్చిందని అన్నారు.

కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే కర్ణాటక ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్ స్టాండ్ పై ఉత్కంఠగా మారింది. మిత్రపార్టీగా ఉన్న జేడీఎస్ చిత్తుగా ఓడిపోవడంతో రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయానికి కర్ణాటకలో గులాబీ బాస్ కేసీఆర్ ఎలాంటి నిర్ణయంతో ముందుకు వెళ్తారనేది ఆసక్తిగా మారింది.



Next Story

Most Viewed