మల్లారెడ్డి ఇలాఖాలో అనూహ్య రాజకీయ పరిణామం

by Dishafeatures2 |
మల్లారెడ్డి ఇలాఖాలో అనూహ్య రాజకీయ పరిణామం
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: అనుకున్నట్టుగానే జరిగింది. జవహర్ నగర్ మేయర్ మేకల కావ్యపై అవిశ్వాస తీర్మానం చేస్తూ నోటీసును కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. కార్పొరేషన్ లో శుక్రవారం నుంచి రాజకీయాలు వేడెక్కాయి. పార్టీ విప్ ను లెక్కచేయకుండా అవిశ్వాస తీర్మాన సమావేశం పెట్టడమే కాకుండా ఏకంగా జీహెచ్ఎంసీ యాక్ట్ 1955 అనుసరించి 91 ఏ సెక్షన్ ప్రకారం 20 మంది కార్పొరేటర్లు సంతకం చేసిన పత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో శనివారం అందించారు. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 28 వార్డులు ఉండగా వారిలో 1, 2, 3, 4, 6, 8, 9, 10, 11, 14, 17, 18, 19, 20, 21, 23, 24, 25, 26, 28 వార్డులకు చెందిన కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాణ నోటీసులపై సంతకాలు చేశారు. అవిశ్వాస తీర్మాన పత్రాన్ని పలువురు కార్పొరేటర్లు కలెక్టర్ కార్యాలయంలో అందించారు.


Next Story

Most Viewed