HYD : IPL మ్యాచ్ టికెట్ల బ్లాక్ దందా.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సహా మరో వ్యక్తి అరెస్ట్

by Disha Web Desk 4 |
HYD : IPL మ్యాచ్ టికెట్ల బ్లాక్ దందా.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సహా మరో వ్యక్తి అరెస్ట్
X

దిశ, క్రైమ్ బ్యూరో : ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ టికెట్‌లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ఇద్దరినీ హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరి నుంచి 100 టికెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ డీసీపీ రష్మీ పెరుమాల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. బెంగుళూరుకు చెందిన చిత్తూరు రమణ, హైదరాబాద్‌కు చెందిన శామ్యూల్ సుశీల్‌లు వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా స్నేహితులు అయ్యారు. ఈ ఇద్దరికీ క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఐపీఎల్ మ్యాచ్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్ ద్వారా ఇతరుల ఐడీలతో టికెట్‌లను సేకరిస్తున్నారు. ఆ తర్వాత క్యూ ఆర్ కోడ్ ల ద్వారా రీడెంప్షన్ కేంద్రాలలో టికెట్‌లను తీసుకుని వాటిని బ్లాక్‌లో అధిక ధరలకు అమ్ముతున్నారు. ఇలా ఈ ఇద్దరు టికెట్‌ల కొరతను సృష్టించి అభిమానులను నిరుత్సాహపరుస్తున్నారు. వీరి బ్లాక్ టికెట్ దందాపై సమాచారం అందుకున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 100 ఐపీఎల్ టికెట్‌లు, మొబైల్ ఫోన్స్‌ను రికవరీ చేశారు.



Next Story

Most Viewed