భారతమాత క్రికెట్ ట్రోఫీ బ్రౌచర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఈటల

by Web Desk |
భారతమాత క్రికెట్ ట్రోఫీ బ్రౌచర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఈటల
X

దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్లలో జరుగనున్న భారతమాత క్రికెట్ టోర్నమెంట్ బ్రౌచర్‌ను హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామిడి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నట్లు తెలిపారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నేతలు మేడ్చల్ రూరల్, అర్బన్ జిల్లాల అధ్యక్షులు విక్రంరెడ్డి, హరీష్ రెడ్డి, మాధవనేని భానుప్రసాద్, కట్టా కుమార్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed