మల్లారెడ్డి నిజమే చెప్పిండు : ఈటల

by Disha Web Desk 23 |
మల్లారెడ్డి నిజమే చెప్పిండు : ఈటల
X

దిశ,మేడ్చల్ బ్యూరో : మల్కాజ్‌గిరి ప్రజల మనస్సులో ఉన్నమాటల్నే మాజీ మంత్రి మల్లారెడ్డి నాతో చెప్పారనీ మల్కాజ్ గిరి లోక్ సభ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. చెంగిచెర్ల లో ఆయన మీడియా తో మాట్లాడుతూ...రెండు లక్షల పైచిలుకు ఓట్లతో మీరు కలవబోతున్నాం అంటూ అనేక మంది ఇప్పటికే నాకు కంగ్రాట్యులేషన్స్ చెప్పారని తెలిపారు. మల్లారెడ్డి తన మనస్సులో మాటలు దాచుకోలేక నాతో అన్నారాని ,"నీవే గెలవబోతున్నావంటూ" ముందస్తుగా చెప్పారంతే నని చెప్పారు. ఇంతమంది ఓబీసీ మంత్రులు గత కేంద్ర ప్రభుత్వాలలో ఎన్నడూ లేరన్నారు. 12 మంది దళిత మంత్రులు ఉన్నారు. 8 మంది ట్రైబల్ మినిస్టర్ లు ఉన్నారు..5 మంది మహిళా మంత్రులు ఉన్నారు. ఒక మహిళ ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు. అలాంటి భారతీయ జనతా పార్టీపై ఇలాంటి పుకార్లు ఎలా వస్తున్నాయి. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తారని కల వచ్చిందా. .. అని ప్రశ్నించారు. అనేక స్కామ్‌లు చేసిన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని గుల్ల చేసి, ఇలాంటి పిచ్చి ప్రకటనలు, వార్తలు ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలు నమ్మరని ఈటల రాజేందర్ అన్నారు.

Next Story

Most Viewed