అధికారుల ఆదేశాలు బేఖాతరు

by Disha Web Desk 20 |
అధికారుల ఆదేశాలు బేఖాతరు
X

దిశ, కుత్భుల్లాపూర్ : కుత్భుల్లాపూర్ మండలం గాజుల రామారంలో కబ్జాల పర్వం యదావిధిగా కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ ప్రభుత్వ భూములను దోపిడీ చేస్తున్నారు. గాజులరామారం సర్వే నెంబర్ 329/1 శ్రీ కృష్ణ టెంపుల్ వెనుక కబ్జాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ భూమిని లూటీ చేసి ప్లాట్లుగా మార్చి కోట్లు కూడబెడుతున్నారు.

కబ్జాలు మావి, కట్టడాలు మావి కేవలం డబ్బులు మాత్రం చెల్లించి రూమ్ సొంతం చేస్కోమంటున్నారు ఇక్కడి కబ్జా మాంత్రికులు. స్థానిక రెవెన్యూ సిబ్బంది సాక్షిగా ఇక్కడి కబ్జాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాలు సైతం బేఖాతర్ చేస్తూ సవాలు విసురుతున్నారు ఇక్కడి కబ్జారాయుళ్లు. ఈ కబ్జాలపై పలువురు ఫిర్యాదులు చేస్తూ, ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతున్నారు.


Next Story

Most Viewed