- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యం : మల్లారెడ్డి
దిశ, జవహర్ నగర్: జవహర్ నగర్ లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మల్కాజిగిరి పార్లమెంట్ మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని జవహర్ నగర్ కార్పొరేషన్ బాలాజీ నగర్, ముత్తుస్వామి కాలనీ, సాయి బాబా కమాన్ నుంచి వికలాంగుల కాలనీ వరకు పలు వీధులు, కమర్షియల్ షాపులలో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, జవహర్ నగర్ తొలి మేయర్ మేకల కావ్య, పార్టీ అధ్యక్షుడు కొండల్, ఉద్యమ కారులు, పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం ముమ్మరం చేశారు. ప్రతి గడప గడపకు వెళ్లి, కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన సంక్షేమాభివృద్ధి వివరించి, కారు గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వెయ్యాలని అభ్యర్థించారు.
పార్టీలో చేరికలు...
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ లోని లెప్రసీ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, నియోజక వర్గం ఇంచార్జి మహేందర్ రెడ్డి, తొలి మేయర్ మేకల కావ్య పార్టీ అధ్యక్షుడు కొండల్ తదితరులు డివిజన్ ఇంచార్జ్ మహేందర్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం దాదాపు 50మంది ఇతర పార్టీ కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో ఉద్యమ కారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.