బాచుపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

by Disha Web Desk 11 |
బాచుపల్లిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..
X

దిశ, కుత్భుల్లాపూర్: గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మంగళవారం సాయంత్రం బైరుని చెరువులో గుర్తు తెలియని మృతదేహం ఉందని సమాచారం వచ్చింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి మద్యం మత్తులో ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు తెలిసింది.

పూర్తిగా కుళ్లిన స్థితిలో గుర్తుపట్ట రాకుండా ఉన్న సుమారు 40 ఏళ్ల వయస్సు గల వ్యక్తి మృతదేహంగా ఉందన్నారు. చెరువులో నుంచి వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసి మార్చురీకి తరలించారు. నీలిరంగు ప్యాంట్, పసుపు రంగు టీ షర్టు, నీలిరంగు టోపీ ధరించి ఉన్నాడని, సంబంధికులు ఎవరైనా ఉంటే బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

Next Story