ట్రక్కు టైరు పేలి కార్మికుడి మృతి

by Disha Web Desk 1 |
ట్రక్కు టైరు పేలి కార్మికుడి మృతి
X

దిశ, మనోహరాబాద్: ప్రమాదవశాత్తు బండల లోడుతో వెళ్తున్న ట్రక్కు టైరు పేలి బోల్తా పడడంతో ఓ కార్మికుడు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలైన ఘటన మనోహరాబాద్ ఐటీసీ పరిశ్రమ ఎదుట ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై సందీప్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ నుంచి చేగుంటకు బండల లోడుతో వెళ్తున్న టాటా ట్రక్కు వెనుక టైరు ఒక్కసారిగా పేలి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రక్కులో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రం, పన్నా జిల్లాకు చెందిన లాల్ సింగ్ (45) అక్కడికక్కడే మృతి చెందాడు. అతనితో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా లాల్ సింగ్ మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వాసుపత్రికి తరలించామని ఎస్సై తెలిపారు.

Next Story

Most Viewed