అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు పోయాయి

by Disha Web Desk 1 |
అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు పోయాయి
X

నడిరోడ్డుపై ఆందోళనలకు దిగిన మృతుడి కుటుంబ సభ్యులు

దిశ, చేర్యాల/మద్దూరు: దూల్మిట్ట మండల పరిధిలోని రెడ్యానాయక్ తండాకు చెందిన ధారవత్ కోటేష్ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మరణించాడు. దీంతో మృతదేహాన్ని పరిశీలించిన మద్దూరు పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేర్యాలకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన భర్త ప్రాణాలు పోయాయంటూ.. విద్యుత్తు అధికారులకు సమాచారం ఇవ్వకుండా మృతుడిని పోస్టుమార్టంకి తీసుకెళ్లడంపై మద్దూరు పోలీసులపై కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. మృతుడి భార్య, కుటుంబ సభ్యులు చేర్యాల రహదారిపై రాస్తారోకోకు దిగారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ధారవత్ కోటేష్ ప్రాణాలు కోల్పోయాడని విద్యుత్ అధికారులు వచ్చి తమకు న్యాయం చేసేంత వరకు పోస్టుమార్టం చేసేందుకు వీలు లేదంటూ ఆందోళనకు దిగారు.


Next Story