మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు చోరీ...దొంగ రిమాండ్​

by Disha Web Desk 15 |
మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు చోరీ...దొంగ రిమాండ్​
X

దిశ, కంది : ఓ మహిళ మెడలో నుంచి ఓ వ్యక్తి పుస్తెలతాడును ఎత్తుకెళ్లాడు. ఈ కేసులో నిందితుడిని రెండు రోజుల్లోనే సంగారెడ్డి పట్టణ పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డిలోని బాబానగర్ కు చెందిన సువర్ణ రాణి ఈ నెల 4న పని నిమిత్తం పాత బస్ స్టాండ్ కు వెళ్లి తిరిగి తన ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. ఆ సమయంలో ప్రభుత్వ దవాఖాన సమీపంలో మసీద్ కు ఎదురుగా ఓ వ్యక్తి ఆమె వెనుక నుండి బైక్​పై వచ్చి స్వరూప రాణి మెడలో నుండి 2 వరుసల పుస్తెల తాడు గుంజుకుని పారిపోయడు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్టాఫ్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడైన శ్రీకాంత్ ను పట్టుకున్నారు. నిందితుని స్వగ్రామం కొండాపూర్ మండలంలోని చర్ల గోపులారమని, ఈ మేరకు అతడిని రిమాండుకు తరలిస్తున్నట్టు సీఐ తెలిపారు.


Next Story

Most Viewed