- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు చోరీ...దొంగ రిమాండ్
by Disha Web Desk 15 |
X
దిశ, కంది : ఓ మహిళ మెడలో నుంచి ఓ వ్యక్తి పుస్తెలతాడును ఎత్తుకెళ్లాడు. ఈ కేసులో నిందితుడిని రెండు రోజుల్లోనే సంగారెడ్డి పట్టణ పోలీసులు పట్టుకున్నారు. పట్టణ సీఐ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డిలోని బాబానగర్ కు చెందిన సువర్ణ రాణి ఈ నెల 4న పని నిమిత్తం పాత బస్ స్టాండ్ కు వెళ్లి తిరిగి తన ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. ఆ సమయంలో ప్రభుత్వ దవాఖాన సమీపంలో మసీద్ కు ఎదురుగా ఓ వ్యక్తి ఆమె వెనుక నుండి బైక్పై వచ్చి స్వరూప రాణి మెడలో నుండి 2 వరుసల పుస్తెల తాడు గుంజుకుని పారిపోయడు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్టాఫ్ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడైన శ్రీకాంత్ ను పట్టుకున్నారు. నిందితుని స్వగ్రామం కొండాపూర్ మండలంలోని చర్ల గోపులారమని, ఈ మేరకు అతడిని రిమాండుకు తరలిస్తున్నట్టు సీఐ తెలిపారు.
Next Story