రూ. 400 కోసం మహిళకు కల్లు తాగించి హత్య.. వెలుగులోకి దారుణ విషయాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-04-11 11:17:42  IST  )

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో కలకలం రేపిన మహిళ మిస్సింగ్‌ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు

రూ. 400 కోసం మహిళకు కల్లు తాగించి హత్య.. వెలుగులోకి దారుణ విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: మెదక్‌ జిల్లా నర్సాపూర్‌(Narsapur)లో కలకలం రేపిన మహిళ మిస్సింగ్‌(woman missing) కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. గత నెల 25న అదృశ్యమైన మహిళను రూ.400 కోసం మహబూబ్‌నగర్‌ జిల్లా(Mahabubnagar District)కి చెందిన గోపాల్(Gopal) హత్య చేశాడు. ఆమె వద్ద ఉన్న రూ.400 చూసిన గోపాల్.. మాట కలిపి కల్లు(Palm Wine) తాగించాడు. అనంతరం మహిళను అత్యంత దారుణంగా హత్య చేశాడు. తాగుడుకు బానిసైన గోపాల్ డబ్బుల కోసం కొంతకాలంగా హత్యలకు పాల్పడుతున్నారు. గతంలో వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో గోపాల్ హత్యలు చేశారు. ఈ కేసుల్లో విచారణ జరుగుతుండగానే మరో మహిళను గోపాల్ హత్య చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు మిస్టరీని ఛేదించారు. నిందితుడు గోపాల్‌ను గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Next Story