- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా సంఘాలకు రూ.304 కోట్ల వడ్డీలేని రుణాలు : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
దిశ, చిన్నశంకరంపేట : రాష్ట్రంలో మహిళా సంఘాలకు రూ.304 కోట్ల వడ్డీలేని రుణాలు ప్రభుత్వం అందజేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. మంగళవారం చిన్నశంకరంపేట మండల

దిశ, చిన్నశంకరంపేట : రాష్ట్రంలో మహిళా సంఘాలకు రూ.304 కోట్ల వడ్డీలేని రుణాలు ప్రభుత్వం అందజేస్తుందని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. మంగళవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాకు సంబంధించి రూ.30 కోట్లు నియోజకవర్గానికి సంబంధించి రూ. 2 కోట్ల 88 లక్షలు చెక్కులను అందజేశారు. చిన్న శంకరంపేట మండలంలోని కోరిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనంగా మరోసారి రాష్ట్రంలోని 3లక్షల 50 వేల స్వయం సహాయక మహిళా సంఘాలకు 304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందించనున్నది. ఇందుకు మంగళవారం ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ లేని రుణాలను మూడో విడత అందించేందుకు శ్రీకారం చుట్టింది.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు వడ్డీ లేని రుణాలను ఇచ్చిన విషయం తెలిసిందే. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని, వారి కాళ్ళ మీద వారిని నిలబడేలా తీర్చిదిద్ది కుటుంబాలను అభివృద్ధి చేసేందుకు, తద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకుంటామన్న ప్రజా ప్రభుత్వ హామీ మేరకు మహిళలకు అన్ని రంగాలలో అవకాశాలు కల్పిస్తున్నది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ మహిళా సంఘాలకు పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టే పనిని, అమ్మ ఆదర్శ పాఠశాల పనులను అప్పగించింది. బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలను కల్పించడం, ఇటీవల కాలంలో పెట్రోల్ బంకుల నిర్వహణను కూడా మహిళలకు అప్పగించింది. అంతేకాక ప్రతి జిల్లా కేంద్రంలో ఎంపిక చేసిన ప్రాంతాలలో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయడమే కాకుండా, వికలాంగులు, జెండర్ సమస్యల కోసం సామాజిక కార్యక్రమాల నిర్వహణను, గ్రామ సంఘాలకు, మండల సమాఖ్యలకు భవనాల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం కల్పిస్తున్నది.ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం మహిళలకు వడ్డీ లేని రుణాలను పెద్ద మొత్తంలో ఇస్తున్నారాని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఎంపీడీవో దామోదర్, మండల పార్టీ అధ్యక్షుడు సాన సత్యనారాయణ, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ ఆవుల గోపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ సుధాకర్, హలవత్ మోహన్ పాల్గొన్నారు.






