- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, సిద్దిపేట ప్రతినిధి : రంగనాయక సాగర్ లో ఇటీవల మిడ్ మానేరు ద్వారా నీటి పంపింగ్ జరిగింది కాబట్టి కాలువల్లో నీటి విడుదలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ఇరిగేషన్ అధికారులను కోరారు. సిద్దిపేట ఇరిగేషన్ ఎస్ ఈ బస్వరాజ్, ఈఈ గోపాల కృష్ణతో మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ లో మాట్లాడారు. ప్రస్తుతం రంగనాయక సాగర్ లో 2.3 టీఎంసీల నీరు ఉంది. 3టిఎంసిల పూర్తి సామర్థ్యం నీటిని నింపాలన్నారు. రిజర్వాయర్ ల నుండి కాలువలకు నీటిని విడుదల చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. అదేవిధంగా కెనాల్స్ లలో మట్టి, పిచ్చి గడ్డి తుంగ పెరుక పోయిందని వెంటనే తొలగించాలని చెప్పారు.
Next Story






