- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
దిశ,వెల్దుర్తి : శాసనసభ ఎన్నికల్లో అబద్ధపు ప్రచారం చేసి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని యశ్వంత్రావుపేట, మంగళపర్తి మానేపల్లి, అందుగులపల్లి మమ్మద్ నగర్ తండా, ధర్మారం, దామరం, కుకునూరు, బస్వాపూర్ చర్లపల్లి, చేరిలానెల్లూరు, పెద్దాపూర్, హస్తాల్పూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలుపు కోసం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజలకు వివరించారు.
గెలిచిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించినన్నారు. రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారని, పేదింటి ఆడబిడ్డకు పెళ్లి కోసం అదనంగా తులం బంగారం ఇస్తామని ఇవ్వలేదని, కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఆమె తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జెడ్పీటీసీ రమేష్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ అనంతరెడ్డి, సొసైటీ డైరెక్టర్ రమేష్ చందర్, ఎంపీటీసీ మోహన్ రెడ్డి, తోటనర్సింలు, శ్రీనివాసురెడ్డి ,తాజా మాజీ సర్పంచ్ సుజాత, అశోక్ రెడ్డి, మల్లేశంగౌడ్, కొత్త గంగాధర్, శ్రీనివాసుగౌడ్, యవకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.