వ‌రి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాల‌ని రైతుల నిర‌స‌న

by Ratna Kumari |

వరి ధాన్యం కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామం వద్ద రైతులు నిరసన తెలిపారు.

వ‌రి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాల‌ని రైతుల నిర‌స‌న
X

దిశ‌, సిద్ధిపేట అర్బ‌న్ : వరి ధాన్యం కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి గ్రామం వద్ద రైతులు నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట - తొగుట రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వరి ధాన్యం కొంటారా.. కొనరా అని సూటిగా ప్రశ్నించారు. వరిధాన్యం కొనుగోళ్లు ప్రారంభించని పక్షంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.

Next Story