బడి బాగుకు 'చింత' భారీ చేయూత.. కలెక్టర్‌కు చెక్కు అందజేత..

by Disha Web Desk 19 |
బడి బాగుకు చింత భారీ చేయూత.. కలెక్టర్‌కు చెక్కు అందజేత..
X

దిశ ప్రతినిధి, సంగారెడ్డి: వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న మన ఊరు– మనబడి కార్యక్రమానికి సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్​ పార్టీ జిల్లాఅధ్యక్షుడు చింతా ప్రభాకర్​తన వంతు చేయూతనందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బడి బాగుకోసం విరాళాలు ఇవ్వాలని ఇటీవలే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్​రావు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజాప్రతినిధులు, ఇతరులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే మంత్రి హరీష్​రావు రూ. 2లక్షలు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెల వేతనం అందించిన విషయం తెలిసిందే. కాగా, తన వంతుగా చింతా ప్రభాకర్​రూ.2 లక్షల విరాళం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్​హనుమంతారావు చింతా ప్రభాకర్‌ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. మేధావులు, విద్యవంతులు, ఇతరులు మన ఊరు–మన బడిలో భాగంగా పాఠశాలల బాగుకోసం విరాళాలు అందించాలని హనుమంతరావు కోరారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్​బోధన చేపడుతున్న మంచి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని ప్రభాకర్​అన్నారు. పాఠశాలలో మౌళిక వసతుల కల్పనకు ఈ డబ్బులు వినియోగించాలని ప్రభాకర్​కోరారు. ఈ మంచి కార్యక్రమానికి నా వంతుగా విరాళం ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. ప్రభాకర్‌తో పాటు మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్​రెడ్డి, చక్రి, మోహన్​నాయక్, మల్లేశం, శ్రావన్​రెడ్డి తదిరులు ఉన్నారు.



Next Story

Most Viewed