- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్రీడలతో యువతకు ఉజ్వల భవిష్యత్తు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
క్రీడలతో యువతకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభించారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

దిశ, పటాన్ చెరు : క్రీడలతో యువతకు ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు అందించాలన్న సమున్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభించారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం పటాన్ చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన పటాన్ చెరు మండల, డివిజన్ స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, పటాన్ చెరు జడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, తాహసీల్దార్ పరమేశం, ఎంపీడీవో బన్సీలాల్, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ బాలయ్య, ఎంఈవో రాథోడ్, సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, డీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు అఫ్జల్, మండలాధ్యక్షుడు పాండు, వివిధ శాఖల అధికారులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు పాల్గొన్నారు.






