పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

by Disha Web Desk 1 |
పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య
X

దిశ, చేర్యాల: క్షణికావేశంతో పురుగుల మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని కడవేర్గు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడవేర్గు గ్రామానికి చెందిన ఆరుట్ల ప్రసాద్ (30) అనే యువకుడు క్షనికావేశంతో ఇటీవల పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబ సభ్యులు చేర్యాల ప్రభుత్వ అసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. మృతుడు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.



Next Story