- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గుండెపోటుతో తరగతి గదిలో కుప్పకూలిన ఉపాధ్యాయురాలు.. చికిత్స పొందుతూ మృతి
చౌటకూర్ ప్రాథమిక పాఠశాలలో ఘటన
దిశ, ఆందోల్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఉపాధ్యాయురాలు పద్మలత ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయింది. సంగారెడ్డిలోని చాణిక్యపురి కాలనీకి చెందిన పద్మలత చౌటకూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తుంది. బుధవారం పాఠశాలకు వచ్చిన ఆమె తరగతి గదిలో ఉన్న సమయంలో గుండె నొప్పి రావడంతో కుప్పకూలిపోయింది. అప్రమత్తమైన తోటి ఉపాధ్యాయులు ఆమెను వెంటనే సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. గత ఐదేళ్లుగా చౌటకూర్ ప్రాథమిక పాఠశాలలోని విధులు నిర్వహిస్తూ అందరితో కలుపుగోలుగా ఉండే ఆమె మృతి చెందడం పట్ల తోటి ఉపాధ్యాయులు తట్టుకోలేకపోతున్నారు. ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.