రోడ్డుపై గుంత.. పొంచి ఉన్న ప్రమాదం

by Disha Web Desk 11 |
రోడ్డుపై గుంత.. పొంచి ఉన్న ప్రమాదం
X

దిశ, దుబ్బాక: నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో రోడ్డుపై గుంత ప్రమాదకరంగా పొంచి ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదు. దుబ్బాక పట్టణ కేంద్రంలో సాయిరాం వైన్స్, కల్లు దుకాణం మధ్యలో రోడ్డుపై గత కొన్ని నెలలుగా గుంత ప్రమాదకరంగా మారింది. ఈ గుంత వల్ల వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి శనివారం వారాంతపు సంత నిర్వహిస్తారు. ఈ సంతకు వందలాది మంది పలు గ్రామాల నుంచి వచ్చి వ్యాపారం చేస్తారు. ఏదైనా ప్రమాదం జరిగితే హడావుడి చేసే అధికారులు ప్రమాదం జరుగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలను మాత్రం చేపట్టడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


Next Story

Most Viewed