చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి

by Disha Web Desk 1 |
చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి
X

దిశ, చేగుంట : చేపలు పట్టేందుకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మాసాయిపేట మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలం కేంద్రానికి చెందిన పల్లపు మల్లేష్ (45) సమీపంలో ఉన్న క్వారీలో ఉన్న చేపలు పట్టేందుకు వలలు వేశారు. రాత్రివేళ చేపలు బయటకు తీసేందుకు క్వారీలోకి దిగిన మల్లేష్ వలలో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆసుపత్రి తరలించి దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story