మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి

by velandi.Saikiran |

మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎం ఈ ఓ కోడెపాక రఘుపతి ఆధ్వర్యంలో, ఘనంగా వనమహోత్సవం నిర్వహించారు.

మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి
X

దిశ, చిట్యాల: మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎం ఈ ఓ కోడెపాక రఘుపతి, ఇన్చార్జి హెచ్ఎం శ్రీరామ్ రఘుపతి ఆధ్వర్యంలో, ఘనంగా వనమహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ, విద్యార్థినీ, విద్యార్థులు విధిగా పాఠశాలలో, గృహాలు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని తద్వారా ముందు తరాలను కాపాడుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ బొమ్మ రాజమౌళి, నీలిమా రెడ్డి , కల్పన,విజయలక్ష్మి, ఉస్మాన్ అలీ, సాంబారు రామనారాయణ, సుజాత, శ్రీనివాస్, శంకర్, ఫిజికల్ డైరెక్టర్ సూధం సాంబమూర్తి, మౌనిక, బుజ్జమ్మ, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story