సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు 50 వేల మంది జనసమీకరణ

by Disha Web Desk 15 |
సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు 50 వేల మంది జనసమీకరణ
X

దిశ,పెద్ద శంకరంపేట్ : నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో ఈనెల 26వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ స్థలాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తో కలిసి నారాయణఖేడ్ నియోజకవర్గం ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి, మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ లు పరిశీలించారు.

స్థానిక ఎమ్మెల్యే పటోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ ఈనెల 26వ తేదీన జరిగే బహిరంగ సభకు సుమారు 50 వేల మంది జన సమీకరణ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సురేందర్ రెడ్డి, పేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయిని మధుసూదన్, మాజీ సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు గంగా రెడ్డి, సంగమేష్ సెట్, ఆర్ఎన్ సంతోష్ కుమార్, దేవేందర్, రఘుపతి రెడ్డి, రాజేందర్ గౌడ్, పెర్మల్ గౌడ్, జైపాల్ గౌడ్ పాల్గొన్నారు.



Next Story

Most Viewed