బాలికపై అత్యాచారం

by Bhanu |

ఓ బాలికపై నలుగురు యువకులు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.

బాలికపై అత్యాచారం
X

దిశ, సంగారెడ్డి: ఓ బాలికపై నలుగురు యువకులు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. సంగారెడ్డి పట్టణానికి చెందిన 13 ఏళ్ల బాలిక ఈ నెల 4న ఎవరికి చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లింది. బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ నెల 8న బాలిక సికింద్రాబాద్‌లో ఉండగా 17 ఏళ్ల ఇద్దరు యువకులు, మరో 19 ఏళ్ల ఇద్దరు యువకులు బాలికతో మాట్లాడి లాడ్జిలో ఉంటున్నామని తీసుకెళ్లి అత్యాచారం చేశారు. వారిని అదుపులో తీసుకుని ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే బాలిక ఇష్టపూర్వకంగానే వారితో వెళ్లినట్లు పోలీసు విచారణలో తేలింది. ప్రస్తుతం బాలికకు కౌన్సెలింగ్ నిర్వహించి హోమ్‌కు తరలించనున్నారు.

Next Story