ఆ పని చేస్తే పాస్టర్లకు ఉరిశిక్షవేయండి: ప్రేమ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 19 |
ఆ పని చేస్తే పాస్టర్లకు ఉరిశిక్షవేయండి: ప్రేమ్ కుమార్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మత మార్పిడి చేస్తే బుల్లెట్లు దించుతామన్న అదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు మాటలకు.. ‘బుల్లెట్లు దించే కొద్ది క్రైస్తవ్యం విస్తరిస్తుంది’ అంటూ క్రైస్తవ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. బాపురావు మాటలు హింసను ప్రేరేపించే రీతిగా మాట్లాడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం, కోర్టులు ఆయన మాటలను సుమోటోగా స్వీకరించి, క్రిమినల్ కేసులను నమోదు చేయాలని మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. ఆదివాసులను బలవంతంగా మతమార్పిడి చేసినట్లయితే బుల్లెట్లు దించడం కాదు పాస్టర్లకు ఉరిశిక్ష వేయాలని హెచ్చరించారు.

బలవంతంగా ప్రజలు ఏ మతంలోకి వెళ్ళరని, వారికి నచ్చిన మతాన్ని మాత్రమే స్వీకరిస్తారని స్పష్టంచేశారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అని అందుకే ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలను మార్చగలుగుతున్నారని, వారికి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చని, అది రాజ్యాంగం కల్పించిన హక్కుగా పేర్కొన్నారు. ప్రజలు ఎప్పుడైనా హింస మార్గాన్ని కోరుకోరని, అహింస, శాంతి మార్గాన్ని కోరుకుంటారని తెలిపారు. ఎంపీ సోయం బాపురావు క్రైస్తవులకు క్షమాపణ చెప్పాలని, లేదంటే తగిన సమయంలో ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

Next Story

Most Viewed