చైనా మాంజాలు విక్రయిస్తే కఠిన చర్యలు

by Ratna Kumari |

చైనా మాంజాలను విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఐ రమేష్ తెలిపారు. జిల్లా ఎస్పీ వినీత్ ఆదేశాల మేరకు ఎస్ఐ సూచన మేరకు మండల కేంద్రంలో పతంగుల విక్రయ దుకాణాలలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

చైనా మాంజాలు విక్రయిస్తే కఠిన చర్యలు
X

దిశ, ఊట్కూర్ : చైనా మాంజాలను విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఎస్ఐ రమేష్ తెలిపారు. జిల్లా ఎస్పీ వినీత్ ఆదేశాల మేరకు ఎస్ఐ సూచన మేరకు మండల కేంద్రంలో పతంగుల విక్రయ దుకాణాలలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పతంగులు ఎగురవేసే క్రమంలో చైనా మాంజలు వాడితే పిల్లల వేళ్లు తెగడంతో పాటు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. అలాగే పక్షులు.. వన్యప్రాణాలకు ప్రాణ ముప్పు పొంచి ఉందన్నారు. గాలిపటాలు ఎగర వేసేటప్పుడు కేవలం నూలు దారాలతో మాత్రమే ఎగరవేయాలన్నారు. ఎవరైనా చైనా మాంజలను విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. రాజ్ నరసయ్య పోలీసులు ఉన్నారు.

Next Story