పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం

by Dishanational2 |
పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం
X

దిశ, బీబీనగర్ : మండలంలోని భట్టుగూడ జడ్పీహెచ్‌ఎ‌స్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం గుర్తు తెలియని దుండగులు క్షుద్ర పూజలు నిర్వహించారు. గురువారం ఉదయం ఉపాధ్యాయులు పాఠశాలకు చేరుకునేసరికి ఆఫీస్ ల ముందు పసుపు ,కుంకుమ కోడిగుడ్లు,బియ్యం, నిమ్మకాయలు, ఉప్పు నాణేలు చల్లడం గమనించారు. ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ రెడ్డి వెంటనే స్థానిక ప్రజాప్రతినిధుల‌తోపాటు పోలీసులకు సమాచారం అందించారు. గురువారం అమావాస్య కావడంతో దుండగులు క్షుద్ర పూజ నిర్వహించినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇలాంటి పనులకు అడ్డుకట్ట వేయొచ్చని ఎస్సై సైదులు స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు.



Next Story

Most Viewed