జాతీయ ర‌హ‌దారిని గంట‌ల కొద్ది దిగ్బంధం చేయ‌కూడ‌దు : మంత్రి వాకిటి శ్రీహ‌రి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, మ‌క్త‌ల్ : రాయచూరు- హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతుల ముసుగులో దాదాపు మూడు గంటల పాటు దిగ్బంధం చేస్తే ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్న ప్రయాణికులు అత్యవసర రోగస్తులు, వృద్దుల పరిస్థితి ఏమి

జాతీయ ర‌హ‌దారిని గంట‌ల కొద్ది దిగ్బంధం చేయ‌కూడ‌దు : మంత్రి వాకిటి శ్రీహ‌రి
X

దిశ‌, మ‌క్త‌ల్ : రాయచూరు- హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతుల ముసుగులో దాదాపు మూడు గంటల పాటు దిగ్బంధం చేస్తే ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్న ప్రయాణికులు అత్యవసర రోగస్తులు, వృద్దుల పరిస్థితి ఏమి కావాలని, పోలీసుల విధి నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంద‌ని మంత్రి వాకిటి శ్రీహరి పోలీసులపై మండిపడ్డారు. రైతులు, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై నిర‌స‌న తెలిపాలి. కానీ గంటల కొద్ది జాతీయ రహదారిపై మూడు గంటల పాటు రోడ్డుపై బైఠాయించి దిగ్బంధం చేయడం వల్ల రోడ్డుకు ఇరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోవ‌డం.. అందులో ప్రయాణిస్తున్న వారు ఇబ్బంది పడడం ప్రయాణించే వాహనాల్లో చికిత్సల కోసం వెళ్లేవారు ఉంటారని అందులో అంబులెన్సులు కూడా ఉన్నాయని చేయడం రాస్తారోకును నివారణ చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా ప్రేక్షక పాత్ర వహించడం విడ్డూరంగా ఉందని ఇలాంటివి ఇక ముందు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని పోలీసులకు చూయించారు.

Next Story