త‌ల్లి, కొడుకు అదృశ్యం

by Ratna Kumari |

త‌ల్లి, కుమారుడు అదృశ్య‌మైన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని వ‌ల్ల‌భాపూర్ తండాలో చోటు చేసుకుంది.

త‌ల్లి, కొడుకు అదృశ్యం
X

దిశ‌, వీప‌న‌గండ్ల : త‌ల్లి, కుమారుడు అదృశ్య‌మైన సంఘ‌ట‌న మండ‌ల ప‌రిధిలోని వ‌ల్ల‌భాపూర్ తండాలో చోటు చేసుకుంది. ఎస్సై న‌రేష్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. వ‌ల్ల‌భాపూర్ తండా కు చెందిన మూడావ‌త్ ల‌లిత‌(28) త‌న చిన్న కుమారుడు అభిరామ్ (4)తో క‌లిసి ఈనెల 23న వ‌న‌ప‌ర్తి ప‌ట్ట‌ణంలో కొత్త బ‌ట్ట‌లు కొనుగోలు చేసేందుకు వెళ్తాన‌ని ఇంట్లో చెప్పి వెళ్లింది. మంగ‌ళ‌వారం సాయంత్రం వ‌ర‌కు కూడా ఇంటికి చేరుకోలేదు. దీంతో బందువులు, తెలిసిన వారిని సంప్ర‌దించిన ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో కుటుంబ స‌భ్యులు పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్టు ఎస్సై న‌రేష్ వెల్ల‌డించారు.

Next Story