చిరుధాన్యాలు సాగు చేయాలి

by velandi.Saikiran |

కారువంగా గ్రామంలో శుక్రవారం కృషి విజ్ఞాన కేంద్రం పాలెం జాతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ రాజేంద్రనగర్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖేత్ బచావో అభియాన్ అవగాహన సదస్సు నిర్వహించారు.

చిరుధాన్యాలు సాగు చేయాలి
X

దిశ, తెలకపల్లి : మండల పరిధిలోని కారువంగా గ్రామంలో శుక్రవారం కృషి విజ్ఞాన కేంద్రం పాలెం జాతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ రాజేంద్రనగర్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఖేత్ బచావో అభియాన్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సేవా నాయక్, సంతోష్ కుమార్ గుప్తా రైతులను ఉద్దేశిస్తూ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాలను తెలియజేశారు. అలాగే చిరుధాన్యాల సాగు, వాటి పోషక విలువలను వివరించారు. చిరు ధాన్యాలు సాగు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌని శ్రావ్య ఏఈఓ, అమరేందర్ రెడ్డి, సర్పంచ్, కోసిరెడ్డి రమణారెడ్డి, జంగయ్య పాల్గొన్నారు .

Next Story