హోలీ వేడుకల్లో విషాదం... నవ వరుడు మృతి

by Dishanational1 |
హోలీ వేడుకల్లో విషాదం... నవ వరుడు మృతి
X

దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: హోలీ వేడుకల అనంతరం చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన యువకుడు గల్లంతయ్యాడు. హోలీ రోజే జరిగిన ఈ విషాదకర ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన వినయ్(25) 15 రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. కాగా, మంగళవారం హోలీ సందర్భంగా వేడుకనంతరం జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ చెరువులో స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడ్డాడు. ఈత రాకపోవడంతో మృతిచెందగా వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.



Next Story

Most Viewed