జూనియర్ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేయాలి..

by Disha Web Desk 11 |
జూనియర్ పంచాయతీ సెక్రటరీలను రెగ్యులరైజ్ చేయాలి..
X

దిశ ప్రతినిధి, నారాయణపేట: జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి గడిచిన నాలుగు సంవత్సరాల తమ ప్రోహిబిషన్ ను పరిగణలోకి తీసుకొని గ్రేడ్ 4 కింద వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి సత్యనారాయణ చౌరస్తా పాత బస్టాండ్ మీదుగా కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయబద్దమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కోయ శ్రీ హర్షకు అందజేశారు.



Next Story

Most Viewed