పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం విజయం తథ్యం : మాజీ ఎమ్మెల్యే

by Disha Web Desk 23 |
పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం విజయం తథ్యం : మాజీ ఎమ్మెల్యే
X

దిశ,కోస్గి : రాబోయే ఎంపీ ఎన్నికల్లో హస్తం గుర్తు అభ్యర్థులు రాష్ట్రంలో విజయం సాధించడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే,(రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్) గురునాథ్ రెడ్డిని అన్నారు. గురువారం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి,సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు..ఈ సందర్భంగా గురునాథ్ రెడ్డిని శాలువాలతో వంశీచంద్ రెడ్డి శాలువా కప్పి సన్మానించారు. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులను చర్చించుకున్న ఇరువురు నేతలు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలను గురునాథ్ రెడ్డి, వంశీచంద్ రెడ్డిలు ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.


Next Story