ఘోర ప్రమాదం.. బస్సును ట్రక్కు ఢీ కొట్టడంతో ఆరుగురు మృతి

by Disha Web Desk 12 |
ఘోర ప్రమాదం.. బస్సును ట్రక్కు ఢీ కొట్టడంతో ఆరుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: అతివేగంగా వస్తున్న ట్రక్కు బస్సును ఢీ కొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం ఉత్తర ప్రదేశ్ లోని ఉన్నవ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మధ్యాహ్నం.. ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఇది గమనించిన సమీప గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన స్థలానికి హుటాహుటిన చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. కాగా ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో.. అప్పటికే ఆరుగురు మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు.



Next Story

Most Viewed