- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆటో, టీవీఎస్ ఢీ.. ముగ్గురికి గాయాలు
దిశ, మిడ్జిల్ : ఆటో, టీవీఎస్ లూనా ఢీ కొనడంతో ముగ్గురికి గాయాలైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. జడ్చర్ల పట్టణం సరస్వతి

X
దిశ, మిడ్జిల్ : ఆటో, టీవీఎస్ లూనా ఢీ కొనడంతో ముగ్గురికి గాయాలైన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. జడ్చర్ల పట్టణం సరస్వతి కాలనీకి చెందిన కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం, ఊరుకొండ పేట ఆంజనేయస్వామి దేవాలయానికి ఆటో లో వెళ్తుండగా.. మండల కేంద్రంలోని గ్రామీణ బ్యాంకు వద్ద గ్రామానికి చెందిన సీతారెడ్డి టీవీఎస్ లూనా పై అకస్మాత్తుగా వచ్చాడు. దీంతో తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న సోనీ, ఆమె కొడుకు 15 నెలల బాబు గాయపడ్డారు. టీవీఎస్ నడిపిన సీతారెడ్డి తలకు గాయమైంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Next Story






