ఆస్తి పన్ను చెల్లించకుంటే ఆస్తులు సీజ్: క‌మిషనర్ రామానుజుల రెడ్డి

by Ratna Kumari |

ఆస్తి పన్ను కట్టనివారి ఆస్తులను సీజ్ చేస్తామని నగర పాలక సంస్థ కమిషనర్ రామానుజుల రెడ్డి హెచ్చరించారు.

ఆస్తి పన్ను చెల్లించకుంటే ఆస్తులు సీజ్: క‌మిషనర్ రామానుజుల రెడ్డి
X

దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి: ఆస్తి పన్ను కట్టనివారి ఆస్తులను సీజ్ చేస్తామని నగర పాలక సంస్థ కమిషనర్ రామానుజుల రెడ్డి హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని శ్రీనివాస్ కాలనీ, షాషాబ్ గుట్ట, బండమీదిపల్లి, మర్లు ప్రాంతాల్లో ఆస్తి పన్ను వసూలుకై ఏర్పాటు చేసిన టీం లు ఎలా పనిచేస్తున్నాయని ఆయన పరిశిలించారు. ఆస్తి పన్ను, నీటి రుసుం సకాలంలో చెల్లిస్తే పట్టణం మరింత అభివృద్ధి చెందడానికి దోహదపడిన వారవుతారని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 31 లోపు వందశాతం ఆస్తి పన్ను వసూలు ధ్యేయంగా పనిచేస్తున్నామని, వెంటనే బకాయిలు లేకుండా పన్నులు చెల్లించాలని కమీషనర్ కోరారు.

Next Story