- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, అమ్రాబాద్ : పిడుగు పడి 20 గొర్లు, మేకలు మృతి చెందాయి. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లి గ్రామ వ్యవసాయ పొలాల సమీపంలో గల అటవీ ప్రాంతంలో మెడమోని నారయ్య, బినమోని బాలయ్యకు చెందిన జీవాలను మేపేందుకు తీసుకెళ్లారు.
ఈ సమయంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం తో పాటు పిడుగు పడి పై రైతులకు సంబంధించిన 20 మేకలు, గొర్లు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. ఈ సంఘటనతో ఇద్దరి రైతులకు సుమారు రెండున్నర లక్షల ఆర్థిక నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తమకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేశారు.
- Tags
- thunderbolt
Next Story






