కేటీఆర్ నువ్వో సంస్కార హీనుడివి!.. వెలిచాల రాజేందర్ ఫైర్

by Disha Web Desk 5 |
కేటీఆర్ నువ్వో సంస్కార హీనుడివి!.. వెలిచాల రాజేందర్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కల్వకుంట్ల తారక రామారావు ఓ సంస్కార హీనుడని, థర్డ్ క్లాస్ ఫెలో అని కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. కేటీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకున్నానని, తనకు ఫౌల్ట్రీ ఫామ్ ఇతర బిజినెస్ లు ఇక్కడే ఉన్నాయని, తన తండ్రితో పాటు రాజకీయాల్లో తిరిగానని, కనీసం 30 వేల మందిని పేర్లతో పిలిచే తత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కేటీఆర్ సిద్దిపేట వాస్తవ్యుడని, ఉద్యమంలో కూడా పాల్గొనకుండా.. అమెరికా నుంచి వచ్చి చీమల పుట్టలో పాములా చేరి, కరప్షన్ ద్వారా ఎదిగాడని విమర్శించాడు.

తాను టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు జైళ్లో ఉన్న నాయకులకు బెయిల్ డబ్బు చెల్లించి బయటకి తీసుకొచ్చిన చరిత్ర తనకుందని, కేటీఆర్ కు ఏం అర్హత ఉందని తనపై మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. కేటీఆర్ ను కరీంనగర్ ప్రజలు విషపు సర్పంలా చూస్తారని, వలస పక్షిలా సిద్దిపేట నుంచి వచ్చాడని, ఆంధ్రోళ్లు మమ్మల్ని పాలించడం ఏంటని ఆరోజు చెప్పి మరి మీరు వలస పక్షుల్లాగా కరీంనగర్ కు ఎందుకు వస్తున్నారని, మా పాలన మేం చేసుకుంటామని తేల్చి చెప్పారు. కరీంనగర్ ప్రజలు కేటీఆర్ కు బడిత పూజ చేస్తారని, రాళ్లతో కొడతారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ కుటుంబానికి నేనే చాలా సార్లు సాయం చేశానని, అలాంటి వాళ్లకు ఇవ్వాళ వందల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అలాగే బీఆర్ఎస్ ను ప్రజలు ఇప్పటికే బొంద పెట్టారని, ఈ ఎన్నికల్లో బీజేపీతో మాత్రమే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు.

Next Story