మాజీ MP మందా జగన్నాథం కుటుంబ సభ్యులను పరామర్శించిన KTR

by Gantepaka Srikanth |

అనారోగ్యంతో మరణించిన మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు మందా జగన్నాథం(Manda Jagannadham) పార్థివ దేహాన్ని సందర్శించి బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) నివాళులర్పించారు.

మాజీ MP మందా జగన్నాథం కుటుంబ సభ్యులను పరామర్శించిన KTR
X

దిశ, వెబ్‌డెస్క్: అనారోగ్యంతో మరణించిన మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకుడు మందా జగన్నాథం(Manda Jagannadham) పార్థివ దేహాన్ని సందర్శించి బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా, నాగర్‌కర్నూల్‌ మాజీ ఎంపీ మందా జగన్నాథం అనారోగ్యంతో ఆదివారం రాత్రి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఇటిక్యాలలో 1951 మే 22న జన్మించిన జగన్నాథం నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. 1996, 1999, 2004, 2009లో ఎంపీగా విజయం సాధించారు. 3 సార్లు టీడీపీ, ఒకసారి కాంగ్రెస్‌ తరఫున గెలిచారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికలకు ముందు బీఎస్పీలో చేరారు.

Next Story