- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కొండల్లో నివసించే సంచార జాతులను ఆదుకున్న గిరిజన ముద్దుబిడ్డను పార్లమెంట్కు పంపుదాం: KTR పిలుపు
దిశ, వెబ్డెస్క్: మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవితను తిరిగి ఎంపీగా గెలిపించాలని కేటీఆర్ ట్వీట్ చేశారు. లోక్సభలో తెలంగాణ గొంతును బలంగా వినిపించిన గిరిజన ముద్దుబిడ్డ మాలోత్ కవితను మళ్ళీ పార్లమెంట్కు పంపుదామని కేటీఆర్ తెలిపారు. 2019లో ఎంపీగా గెలిచిన తర్వాత సమ్మక్క-సారక్క జాతరకు జాతీయ హోదా, బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదంతో ఎన్డీఏ ప్రభుత్వంపై పోరాడి తెలంగాణ హక్కుల సాధనకు శ్రమించిందని మాలోత్ కవితను కొనియాడారు. కరోనా మహమ్మారి సమయంలో కొండల్లో, గుట్టలో నివసించే సంచార జాతులకు సైతం తను స్వయంగా వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేసిందని ఆమె సేవలను మరోసారి గుర్తుచేశారు. మహబూబాబాద్ లోక్సభ ప్రజల సమస్యల గురించి తెలంగాణ ప్రయోజనాల గురించి మరింత పోరాటం చేసేందుకు మాలోత్ కవితను తిరిగి ఎంపీగా గెలిపిద్దామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. మాలోత్ కవిత గళం.. మహబూబాబాద్కు బలం! కారు గుర్తుకే మన ఓటు! అంటూ నినాదాలు పలికారు.