మంత్రి కోమటిరెడ్డి మాటలను గుర్తుచేసిన కేటీఆర్

by Disha Web Desk 2 |
మంత్రి కోమటిరెడ్డి మాటలను గుర్తుచేసిన కేటీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లులు జనవరి నుంచి కట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి గత నెలలో చెప్పారని.. అంతకుముందు నవంబర్ నెల నుంచే కట్టొద్దని కోమటిరెడ్డి వెంకట రెడ్డి పిలుపునిచ్చారు.. నేను వారి మాటలనే గుర్తుచేస్తున్నా అని కేటీఆర్ అన్నారు.

నిన్న సమావేశంలో ఈ నెల నుంచి బిల్లులు కట్టొద్దని నేను చెబితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నాది విధ్వంసకర మనస్తత్వం అని మాట్లాడుతున్నారని అసహనం కేటీఆర్ వ్యక్తం చేశారు. నిజాలు మాట్లాడితే వ్యక్తిగత దూషనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల నుంచి తెలంగాణలో ఎవరూ కరెంట్ బిల్లులు కట్టొద్దని.. బిల్లులను సోనియా గాంధీకే పంపుదామని కేటీఆర్ మరోసారి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు.


Next Story

Most Viewed