Telangana Congress : కేటీఆర్ కు నైతికత లేదు : ఎంపీ చామల కిరణ్ కుమార్

by Muthe.Rajitha |

డిసెంబర్ 21న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలనకు కృతజ్ఞత బహిరంగ సభ పోస్టర్ ను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు.

Telangana Congress : కేటీఆర్ కు నైతికత లేదు : ఎంపీ చామల కిరణ్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్ : డిసెంబర్ 21న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే ఏడాది కాంగ్రెస్ ప్రజాపాలనకు కృతజ్ఞత బహిరంగ సభ పోస్టర్ ను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉద్యోగాల భర్తీ జరిగిందని.. కేటీఆర్ కు నిరుద్యోగుల గురించి మాట్లాడే నైతికత లేదని, 10 ఏళ్లలో నిరుద్యోగులను పట్టించుకోలేదని అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 54000 ఉద్యోగాల భర్తీ జరిగిందని, తెలంగాణ యువత కోరుకున్న ప్రజా పాలన వచ్చిందని తెలియ జేశారు. నిరుద్యోగులకు కొత్తగా న్యూ ఇయర్లో మరిన్ని ఉద్యోగాల భర్తీ జరగనుందని, స్కిల్ యూనివర్సిటీ నిరుద్యోగులకు వరంగా మారబోతుందని పేర్కొన్నారు.

Next Story