నిండు కుండల్లా కృష్ణా ప్రాజెక్టులు

by Muthe.Rajitha |

మొంథా తుఫాను ప్రభావంతో ఏపీ, తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

నిండు కుండల్లా కృష్ణా ప్రాజెక్టులు
X

దిశ, వెబ్ డెస్క్ : మొంథా తుఫాను ప్రభావంతో ఏపీ, తెలంగాణాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలతోపాటు ఎగువ రాష్ట్రాల్లోనూ కుండపోత వానలు కురుస్తుండటంతో నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. అవసరమైనచోట గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు అధికారులు. కాగా ప్రస్తుతం కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టుల నీటిమట్టాల వివరాలు.. ఆల్మట్టి 1704.72, నారాయణపూర్ 1614.74, జూరాల 1044.65, తుంగభద్ర 1626.06, శ్రీశైలం 884.50, నాగార్జునసాగర్ 589.70, పులిచింతల 172.01 అడుగులుగా ఉన్నాయి.

Next Story