ప్లాస్టిక్ వినియోగాన్ని త‌గ్గించాలి : శానిట‌రీ ఇన్ స్పెక్ట‌ర్

by Ratna Kumari |

దిశ, కొత్తగూడెం టౌన్ : మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ సుజాత ఆదేశాల మేర‌కు శానిట‌రీ ఇన్ స్పెక్ట‌ర్ అహ్మ‌ద్,

ప్లాస్టిక్ వినియోగాన్ని త‌గ్గించాలి :  శానిట‌రీ ఇన్ స్పెక్ట‌ర్
X

దిశ, కొత్తగూడెం టౌన్ : మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ సుజాత ఆదేశాల మేర‌కు శానిట‌రీ ఇన్ స్పెక్ట‌ర్ అహ్మ‌ద్, ఎన్విరాన్ మెంట్ ఇంజినీర్ వీర‌భ‌ద్ర‌చారి కొత్త‌గూడెం ప‌ట్ట‌ణంలోని నేతాజీ మార్కెట్ లో ప‌లు దుకాణాల్లో అక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్టారు. 120+ మైక్రోన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ ని సీజ్ చేసి ఐదు వేల వరకు జరిమానా విధించారు. అనంతరం శానిటరీ ఇన్ స్పెక్ట‌ర్ మాట్లాడుతూ షాప్ యజమానులు, ప్రజలు ప్లాస్టిక్ కు బదులుగా గుడ్డ సంచుల‌ను , జ్యూట్ బ్యాగులను ఉపయోగించి ప్లాస్టిక్ రహిత నగర కొత్తగూడెం కోసం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జవాన్లు రమణయ్య, నవీన్, లక్ష్మణ్, రవి, శ్రీహరి,రామారావు,వరప్రసాద్, గౌస్ పాల్గొన్నారు.

Next Story